హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): పార్టీ నిర్వహణ కమిటీలు చురుకుగా పనిచేయడంతో టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం విజయవంతమైంది. సమావేశం నిర్వహణ కోసం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఎనిమిది కమిటీలను వేశారు. కమిటీల ప్రతినిధులు పదిరోజులుగా పనులను పర్యవేక్షించారు. ప్రతినిధులకు ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశారు. పార్కింగ్, భోజనం, ప్రతినిధుల నమోదు వలంటీర్లు, సభా వేదిక, అలంకరణ, తీర్మానాల కమిటీలు ఉత్సాహంగా పనిచేశాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభా ప్రాంగణాన్ని పరిశీలించి కమిటీల్లోని నాయకులకు సూచనలు చేశారు. సమావేశ ముగింపు అనంతరం కమిటీ ప్రతినిధులను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. కమిటీల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎంపీ రంజిత్రెడ్డి, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు భానుప్రసాద్రావు, నవీన్కుమార్, శంభీపూర్రాజు, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, కేపీ వివేకానంద, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి బండి రమేశ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కర్నె ప్రభాకర్ తదితరులు చురుగ్గా వ్యవహరించారు.