కోల్కతా: సరదా కోసం చేసిన ఓ పని ఓ వ్యక్తి ప్రాణాన్ని బలితీసుకున్నది. రెహ్మత్ అలీ అనే వ్యక్తి మలద్వారంలోకి తోటి కార్మికులు పైపు చొప్పించి గాలిని పంప్ చేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. బెంగాల్లోని హుగ్లీ జిల్లా నార్త్బ్రూక్ జూట్ మిల్లులో ఈనెల 16న ఈ ఘటన జరిగింది. చికిత్స పొందుతూ రెహ్మత్ శుక్రవారం మృతిచెందాడు. నైట్ షిఫ్ట్ డ్యూటీకి వచ్చిన రెహ్మత్ను తోటి కార్మికులు సరదా పేరుతో అతన్ని గట్టిగా పట్టుకుని.. ఎంత ప్రతిఘటించినప్పటికీ వదలకుండా ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన తర్వాత రెహ్మత్ అనారోగ్యం బారిన పడడంతో దవాఖానలో చేరాడు. గాలి ఒత్తిడి కారణంగా రెహ్మత్ లివర్ పూర్తిగా చెడిపోయిందని వైద్యులు తెలిపారు.