ఇటిక్యాల: దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో బాగంగా మూడవ బీచుపల్లి క్షేత్రంలోని లక్ష్మీ హయగ్రీవ జ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మవారు విజయలక్ష్మి అవతారంలో కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. . ఆలయ అర్చకులు భవనచంద్ర అమ్మవారికి సుప్రభాతసేవ, తిరువరాధన, కుంకుమార్చన, నైవేద్య నిరాజనాలు, అన్నప్రాసన అక్షరాభ్యాసం, కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ మేనేజర్ సురేందర్రాజు కార్యక్రమాలను పర్యవేక్షించారు. అలాగే క్షేత్రంలోని ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన అమ్మవారు శాకాంబరి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.