పూర్ణ, తేజ త్రిపురాన ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్యాక్డోర్’. కర్రి బాలాజీ దర్శకుడు. బి. శ్రీనివాస్రెడ్డి నిర్మించారు. డిసెంబర్ 3న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్లో చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించింది. హీరో తేజ మాట్లాడుతూ ‘కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రమిది. మహిళా ప్రధాన కథాంశానికి చక్కటి సందేశాన్ని జోడించి దర్శకుడు బాలాజీ తెరకెక్కించారు. పూర్ణతో నా కెమిస్ట్రీ బాగుంటుంది’ అని తెలిపారు. కథ నచ్చి ఈ సినిమాను విడుదల చేస్తున్నానని పంపిణీదారుడు కందల కృష్ణారెడ్డి చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ ‘అక్రమ సంబంధాల కారణంగా తలెత్తే అనర్థాల్ని ఈ సినిమాలో చూపించబోతున్నాం. వివాహితగా పూర్ణ చక్కటి నటనను కనబరించింది. ఆమె కెరీర్లో మంచి సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల, క్రిష్ బండిపల్లి పాల్గొన్నారు.