న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: బ్రహ్మోస్ యాంటీ-షిప్ వెర్షన్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. భారత నౌకాదళం, అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ సంయుక్తంగా బుధవారం ఈ పరీక్షను నిర్వహించాయి. క్షిపణి అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించినట్టు తెలిపాయి.
ఈ నెల 19న భారత వైమానిక దళం సుఖోయ్ యుద్ధవిమానం నుంచి బ్రహ్మోస్ క్షిపణిని పరీక్షించింది. అంతకుముందు హిందూ మహా సముద్రం నుంచి బ్రహ్మోస్ను పరీక్షించారు. బ్రహ్మోస్ క్షిపణి ధ్వని కంటే మూడు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించి లక్ష్యాలను ఛేదిస్తుంది.