తమిళనాడు రాజధాని చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైయినింగ్ అకాడమీ (ఓటీఏ)లో ఘనంగా పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమం జరిగింది. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లు పలు విన్యాసాలు ప్రదర్శించారు. అనంతరం తోటి క్యాడెట్లు, తల్లిదండ్రులతో సంతోషంగా గడిపారు.