సందర్శకుల విహారం నిమిత్తం.. ఆదివారం సాయంత్రం ఓ ఐదు గంటల పాటు ట్యాంక్బండ్ పరిసరాలను సందర్శించేందుకు హెచ్ఎండీఏ ప్రత్యేక ఏర్పాట్లను చేపట్టింది. హుస్సేన్సాగర్ పరిధిలో ట్రాఫిక్ ఫ్రీగా కొనసాగేందుకు విద్యుత్ లైట్లు, సుందరీకరణ పనులను ముమ్మరం చేశారు. సందర్శకులు పిల్లా పాపలతో స్వేచ్ఛగా విహరించేందుకు మైదానాలు, గార్డెన్స్, పాదచారుల మార్గాలను తీర్చిదిద్దుతున్నారు. నగర పౌరులు ట్యాంక్బండ్ను సందర్శించేందుకు తహతహలాడేలా సాగరం చుట్టూరా అందమైన పూల మొక్కలు, ప్రత్యేక విగ్రహాలను ఏర్పాటు చేస్తుంది. సాగరం పరిసరాలలో బ్యూటిఫికేషన్ పనులు చేపడుతూ హెచ్ఎండీఏ ట్యాంక్బండ్ను అందరికీ అందుబాటులోకి తీసుకొస్తుంది.