డెహ్రడూన్, ఆగస్టు 24: మాదకద్రవ్యాల బెడదను అరికట్టేందుకు డెహ్రాడూన్లో కొంతమంది మహిళలు స్వయంగా రంగంలోకి దిగారు. బహిరంగ ప్రదేశాల్లో రాత్రిపూట గస్తీ చేపట్టారు. బయటి వ్యక్తులు కొంతమంది రాత్రిపూట మాదక ద్రవ్యాలు అమ్మేందుకు, కొనుగోలుకు తమ గ్రామానికి వస్తున్నారని, ఇది తరుచుగా ఘర్షణలకు దారితీస్తున్నదని ఆరోపిస్తున్నారు.
విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకురాగా, వారు రెండు రోజులపాటు గస్తీ నిర్వహించి..సమస్యను వదిలేశారని చెప్పారు. దీంతో తామే పర్యవేక్షించటం మొదలుపెట్టామని చెప్పారు.