Covieshield | కొవిషీల్డ్ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసే విషయమై సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సీఈవో అదర్ పూనావాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. కొవిషీల్డ్ టీకాల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి తదుపరి ఆర్డర్లు లేవని చెప్పారు. ఈ నేపథ్యంలో 50 శాతం కొవిషీల్డ్ టీకాల ఉత్పత్తి తగ్గించాలని నిర్ణయించినట్లు ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
ఒకవేళ దేశానికి భారీగా టీకాలు అవసరం అని భావిస్తే అదనపు ఉత్పత్తి సామర్థ్యాన్ని కొనసాగిస్తామన్నారు. అలాగని, వచ్చే ఆరు నెలల్లో అవసరమైన టీకాలను అందుబాటులో ఉంచలేని స్థితిలో ఉండబోమన్నారు. కొత్తగా వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్పై ప్రస్తుత వ్యాక్సిన్లు పని చేయబోవని నమ్మకడానికి ఎటువంటి ఆధారాల్లేవన్నారు.
ఇప్పటికే టీకాలు అంత ప్రభావం చూపబోవన్న మోడెర్నా సంస్థ అధ్యక్షుడు స్టీఫెన్ హగ్.. ఆ వ్యాఖ్యలు చేయడానికి ముందు తగిన సమాచారం లేకుండా చేసి ఉంటారని, దాని వెనుక కారణాలు తనకు తెలియదన్నారు. సరైన సమాచారం లేకుండా అంచనాలు వేసేముందు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కొవాక్స్ కార్యక్రమం కోసం 40-50 కోట్ల డోస్ల ఆర్డర్నూ సమీక్షించానని అదర్ పూనావాలా చెప్పారు. ఆఫ్రికా దేశాల ప్రతినిధులతో సంప్రదిస్తున్నానని తెలిపారు.