చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ముఖ్య అతిథిగా హాజరైన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. సభికులను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తుండగానే రాఖీ చేతిలో పట్టుకుని ఓ మహిళ సరాసరి స్టేజీ మీదకు వచ్చేసింది. దాంతో సీఎం భగవంత్సింగ్ మాన్ ప్రసంగాన్ని ఆపేసి పక్కకు వచ్చారు. నవ్వుతూ ఆ మహిళతో రాఖీ కట్టించుకున్నారు. ఆమెపై తలపై చేయిపెట్టి ఆశీర్వదించారు. ఆ తర్వాత ఆమెను పంపించి తన ప్రసంగాన్ని కొనసాగించారు.
పంజాబ్లోని గురునానక్ దేవ్ యూనివర్సిటీలో బుధవారం మధ్యాహ్నం నిర్వహించిన కార్యక్రమం ఈ అరుదైన ఘటనకు వేదికైంది. ఆ కార్యక్రమంలో సీఎం భగవంత్ మాన్ కొత్తగా ఎన్నికైన అంగన్ వాడీ కార్యకర్తలకు, అంగన్వాడీల్లో సహాయకులకు అప్పాయింట్మెంట్ లెటర్స్ను అందజేశారు. ఈ సందర్భంగా ఓ మహిళ వచ్చి సీఎంకు రాఖీ కట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కింది వీడియోలో ఆ దృశ్యాలను మీరు కూడా వీక్షించవచ్చు.
#WATCH | Amritsar: Punjab CM Bhagwant Mann stopped his speech midway as a woman came to the stage to tie him rakhi
Punjab CM Bhagwant Mann was distributing appointment letters to Anganwadi worker and their helpers at Guru Nanak Dev University pic.twitter.com/9hfs72DqiO
— ANI (@ANI) August 30, 2023