ప్రచారం
రేపటి నుంచి వాట్సాప్ కొత్త కమ్యూనికేషన్ నిబంధనలు అమల్లోకి వస్తాయి. అన్ని కాల్స్ రికార్డు చేస్తారు. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ సహా అన్ని సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచుతారు. ప్రభుత్వానికి, ప్రధానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టకండి. రాజకీయం, మతానికి సంబంధించి తప్పుడు సందేశాలు పంపితే వారంట్ లేకుండా అరెస్ట్ చేస్తారు. వాట్సాప్ మెసేజ్లకు సంబంధించి కొత్త ఫీచర్ అమల్లోకి వచ్చింది. మూడు బ్లూ టిక్లు పడితే ప్రభుత్వం దృష్టికి మీ మెసేజ్ చేరినట్టు అర్థం. రెండు నీలిరంగు, ఒక ఎరుపు రంగు టిక్ పడితే ప్రభుత్వం మీపై చర్యలు తీసుకుంటుందని.. ఒక నీలి, రెండు ఎరుపు రంగు టిక్లు పడితే ప్రభుత్వం మీ మెసేజ్ను పరిశీలిస్తున్నదని అర్థం. ఇక మూడూ రెడ్ టిక్లు పడితే ప్రభుత్వం మీకు వ్యతిరేకంగా ప్రొసీడింగ్స్ ప్రారంభించిందని, త్వరలోనే నోటీసులు జారీ అవుతాయని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్నది.
వాస్తవం
ఈ వార్తలు పూర్తిగా అవాస్తవం. మీ సందేశాలను, కాల్స్ను ప్రభుత్వం రికార్డు చేయదు. వాట్సాప్ కొత్తగా ఎలాంటి కమ్యూనికేషన్స్ నిబంధనలను అమలుచేయలేదు. మూడు రెడ్ లేదా బ్లూ టిక్ ఫీచర్ కూడా ఎక్కడా లేదు. వాట్సాప్ సందేశాలు ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్టెడ్ కాబట్టి వాటిని ఇతరులు చూడటానికి వీలుపడదు.