న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లో ఫేక్ వీడియో పోస్ట్ విషయమై మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) మనీశ్ మహేశ్వరి సోమవారం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. ఘజియాబాద్ ద్వేషపూరిత వీడియో విషయమై మనీశ్ మహేశ్వరికి వ్యతిరేకంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఘజియాబాద్ పోలీసులను కర్ణాటక హైకోర్టు ఆదేశించింది.
కర్ణాటక హైకోర్టు ఆదేశం నేపథ్యంలో ఘజియాబాద్ పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారని వార్తలు వచ్చాయి. దీంతో ట్విట్టర్ ఇండియా ఎండీ మనీశ్ మహేశ్వరి ముందే సుప్రీంకోర్టులో కేవిట్ దాఖలు చేశారు.
కోర్టు ఆదేశాలకు భిన్నంగా ఇతరులు తనపై చర్య తీసుకోకుండా ముందు జాగ్రత్త చర్యగా ఓ వ్యక్తి కేవియట్ పిటిషన్ దాఖలు చేయొచ్చు. ఘజియాబాద్ ద్వేషపూరిత వీడియో కేసులో విచారణకు హాజరు కావాలని మనీశ్ మహేశ్వరికి యూపీ పోలీసులు సమన్లు జారీ చేశారు.
అయితే, తాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని మనీశ్ మహేశ్వరి తెలిపారు.సదరు వీడియో అప్లోడ్పై తాను చేసేదేమీ లేదని వాదించారు.
కరోనా మహమ్మారి నేపథ్యంలో కేసుల విచారణలో భాగంగా సుప్రీంకోర్టు నిందితుల, వాదులు, ప్రతివాదుల వాంగ్మూలాలను వర్చువల్గా నమోదు చేస్తున్నదని మనీశ్ మహేశ్వరి తరఫు న్యాయవాది వాదించారు.
దీని ఆధారంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనీశ్ మహేశ్వరిని విచారించాలని యూపీ పోలీసులను కర్ణాటక హైకోర్టు ఆదేశించింది.