త్రిసూర్: అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న త్రిసూర్ పూరం పటాకుల పండుగ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు చిన్నపాటి వర్షం మధ్య ప్రారంభమైంది. త్రిసూర్ పూరం అనేది కేరళలోని త్రిసూర్లో జరిగే ఆలయ వార్షిక వేడుక. ఇది త్రిసూర్లోని వడక్కునాథన్ (శివ) ఆలయంలో ప్రతి సంవత్సరం పూరం రోజున జరుగుతుంది. మలయాళ క్యాలెండర్ నెల మేడం (ఏప్రిల్-మే)లో పూరం నక్షత్రంతో చంద్రుడు ఉదయించే రోజున దీన్ని నిర్వహిస్తారు.
త్రిసూర్ పూరం పటాకుల పండుగ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ అద్భుతమైన ప్రదర్శన త్రిసూర్ నగరం నడిబొడ్డున తెక్కింకాడు మైదాన్లో నిర్వహించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా మూడుసార్లు వాయిదా పడింది. వడక్కునాథన్ ఆలయంలో ప్రధాన పండుగ తర్వాత మే 11న తెల్లవారుజామున 3 గంటలకు షెడ్యూల్ చేశారు. కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో వాయిదా వేస్తూ వచ్చారు. ఈ పటాకులు కాల్చేందుకు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ను నియంత్రించారు. ఈ వేడుకను లక్షలాదిమంది వీక్షించారు. త్రిసూర్ పూరం పండుగకు కొన్ని రోజుల ముందు నమూనా ప్రదర్శన జరిగింది. పోలీసు రక్షణలో ఉన్న రెండు భవనాల్లో పటాకులను భద్రపరిచారు.
Video @SREEVINOD_NAIR #ThrissurPooram #TheBigBang pic.twitter.com/Z0rjRgVFPR
— FootballWalla (@FootballWalla) May 20, 2022