చెన్నై: తమిళనాడు కాంచీపురం జిల్లాలోని ఒక పెట్రోల్ బంక్లో లీటర్ పెట్రోల్ను ఉచితంగా అందిస్తున్నారు. అయితే దీని కోసం వాహనదారులు తమ ఆధార్, పాన్ కార్డు వివరాలు చెప్పాల్సి ఉంటుందని ప్రకటించారు. లీటర్ పెట్రోల్ ధర వంద దాటిన తరుణంలో ఉతిరామెరూర్ గ్రామస్తులు ఉచిత పెట్రోల్ కోసం తమ ఆధార్, పాన్ కార్డ్ జిరాక్స్ కాపీలతో ఆ బంక్ వద్దకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
కాగా, స్థానిక శ్రీరామ్ కమర్షియల్ వెహికల్ ఫైనాన్స్ సంస్థ ఈ ఉచిత లీటర్ పెట్రోల్ ప్రచారాన్ని చేపట్టినట్లు తెలుస్తున్నది. తమ వ్యాపారం కోసం సంస్థ యాప్ను మొబైల్లో డౌన్లోడ్ చేసుకోమని చెప్పడంతోపాటు ఆధార్, పాన్ కార్డుల వివరాలను సేకరిస్తున్నది. వాటిని ఇచ్చిన వారికి ఒక లీటర్ పెట్రోల్ను ఉచితంగా అక్కడి బంక్ ద్వారా అందిస్తున్నది.
తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే పెట్రోల్ లీటర్ ధరపై రూ.3 మేర తగ్గించింది. ఆగస్ట్ 13న అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశం సందర్భంగా ఈ మేరకు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి పళనివేల్ థిగా రాజన్ ప్రకటించారు. దీని వల్ల ఏటా రూ.1,160 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతుందని తెలిపారు.