అహ్మదాబాద్, మే 26: ఇద్దరు అన్నదమ్ముల మధ్య సెల్ఫోన్ గొడవ ఒకరి ప్రాణాలను తీసింది. ఈ ఘటన గుజరాత్లోని ఖేడా జిల్లాలో ఈ నెల 23న చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్కు చెందిన ఓ కుటుంబం ఖేడా జిల్లాకు వలస వచ్చి ఓ వ్యవసాయక్షేత్రంలో కూలిగా పనిచేస్తున్నది. అయితే ఇద్దరు అన్నదమ్ములు (వీరిద్దరూ మైనర్లు) సెల్ఫోన్లో వీడియోగేమ్లను చెరికాసేపు ఆడుకుంటున్నారు.
తమ్ముడు వంతు వచ్చినప్పుడు ఆడుకుంటుండగా అన్న బలవంతంగా గుంజుకోవడానికి ప్రయత్నించాడు. నిరాకరించిన తమ్ముడిని ఓ పెద్ద రాయితో అన్న కొట్టాడు. దీంతో స్పృహకోల్పోయిన తమ్ముడిని పక్కనే ఉన్న ఓ బావిలో పడేశాడు. దీంతో తమ్ముడు మరణించాడు. వెంటనే అన్న బస్సు ఎక్కి రాజస్థాన్లోని తన సొంతూరుకు వెళ్లిపోయాడు. అయితే చీకటిపడినా తన కుమారులు కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు సొంతూరుకు ఫోన్ చేసి వాకాబు చేశారు. పెద్దకుమారుడు అక్కడే ఉన్నట్టు తెలుసుకొని, అక్కడికి వెళ్లి అతడిని తీసుకొని ఖేడాకు వచ్చారు. విషయాన్ని ఆరా తీయగా తమ్ముడిని చంపినట్టు అన్న చెప్పాడు. చివరికి విషయం పోలీసులకు తెలువడంతో అన్నను అరెస్టు చేశారు.