న్యూఢిల్లీ, అక్టోబర్ 11: లైంగికదాడి కేసులో ఈ నెల 20న తమ ముందు హాజరుకావాలంటూ బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి షానవాజ్ హుస్సేన్కు ఢిల్లీలోని ఓ కోర్టు సమన్లు జారీ చేసింది. షానవాజ్ హుస్సేన్ తనపై లైంగికదాడికి పాల్పడ్డాడని, అనంతరం బెదిరింపులకు దిగుతున్నాడని ఆరోపిస్తూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తొలుత కేసు నమోదు చేసిన పోలీసులు తర్వాత దాన్ని రద్దు చేయాలంటూ కోర్టులో ఓ నివేదికను దాఖలు చేశారు. దీన్ని తోసిపుచ్చిన న్యాయస్థానం ఈ నెల 20న తమ ముందు హాజరుకావాలంటూ షానవాజ్ హుస్సేన్కు సమన్లు జారీ చేసింది.