ISRO | బెంగళూరు, మార్చి 28: ఇప్పటివరకు అమెరికాకు చెందిన నెట్వర్క్ టైమ్ ప్రొటోకాల్ ఆధారంగా పని చేస్తున్న భారత్లోని స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు ఇక నుంచి మన సొంత వ్యవస్థ ద్వారా పని చేయనున్నాయి. ఇందుకోసం ఇస్రో ‘రుబీడియం అటామిక్ క్లాక్’ను అభివృద్ధి చేసి గత ఏడాది లాంచ్ చేసింది.
త్వరలోనే దీనికి మన దేశంలోని స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లను సింక్ చేయనుంది. అటమిక్ గడియారాలు అత్యంత కచ్చితత్వంతో సమయాన్ని కొలుస్తాయి. అందుకే నావిగేషన్ ఉపగ్రహాల్లో కూడా ఈ అటామిక్ గడియారాలనే ఉపయోగిస్తారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వినియోగిస్తున్న అటామిక్ గడియారాల్లో సీసియం అణువులను ఉపయోగిస్తున్నారు. ఈ గడియారంలో రుబీడియం అణువులను వినియోగించారు.