సికింద్రాబాద్ : ఉద్యోగాల పేరుతో మోసగించే వ్యక్తుల పట్ల రైల్వే ఉద్యోగార్థులు అప్రమత్తంగా ఉండాలని దక్షిణమధ్య రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది. మోసగాళ్ల గురించి తెలుసుకోవాలని సూచించింది. 12 మంది వ్యక్తులకు సీనియర్ క్లర్క్స్గా అపాయింట్మెంట్ ఆర్డర్లను అందించినట్లు తెలిపింది. స్క్రూట్నీలో అవి నకిలీగా తేలడంతో ఉద్యోగార్థులు మోసపోయినట్లుగా గుర్తించారన్నారు. పరీక్షల్లో చూపిన ఉత్తీర్ణత శాతం మీద మాత్రమే ఆధారపడి రైల్వేలో ఉద్యోగాలు లభిస్తాయంది. ఈ క్రమంలో నియామకానికి ఇతర వనరులు లేదా మధ్యవర్తుల పాత్ర ఎక్కడా లేదంది.