ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ రియల్మీ మార్చి 24న భారత్లో మరో రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేయబోతోంది. ఐతే లాంచ్కు ముందే ఫ్లిప్కార్ట్లో రియల్మీ 8, రియల్మీ 8ప్రొ మోడళ్ల ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. ఈ సిరీస్లోని ఫోన్లన్నీ 108 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వస్తున్నాయి. 108 ఎంపీ కెమెరా ద్వారా 30 ఫొటోలను తీయడానికి 480 సెకన్లు పడుతుందని ఒక సెకనులోనే వీడియోను రూపొందించొచ్చు అని కంపెనీ పేర్కొంది. స్మార్ట్ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 10 ఐఓఎస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ముందుగా ఫోన్ బుక్ చేసుకున్న యూజర్లు స్పెషల్ డిస్కౌంట్లు, గిఫ్ట్లు పొందే అవకాశం ఉంది.