హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): భారత వాయుసేనలోకి ఫ్లైట్ కెడెట్లుగా అడుగుపెట్టేందుకు యువ అధికారులు సన్నద్ధం అవుతున్నారు. గత కొన్ని నెలలుగా దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్న వారికి కెడెట్ల కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్(సీజీపీ)ను ఈ నెల 19న నిర్వహించనున్నారు. కార్యక్రమానికి భారత వాయుసేన అధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బదౌరియా ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ట్రైనీ అధికారుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించడంతో పాటు అవార్డులు అందించనున్నారు. కొవిడ్ కారణంగా ఈ పరేడ్కు కెడెట్ల కుటుంబ సభ్యులు, బంధువులను అనుమతించడం లేదని.. లైవ్ ద్వారా పరేడ్ను వీక్షించవచ్చని ఎయిర్ఫోర్స్ అకాడమీ అధికారులు తెలిపారు.