మీ ప్రతినిధిగా పనిచేస్తా..
ఉద్యమంలో ఉపాధ్యాయులు, ఉద్యోగుల పాత్ర మరువలేనిది
స్వరాష్ట్రంలో ఏడేళ్లలో ఎంతో అభివృద్ధి
గతానికి, ఇప్పటికి తేడాపై విద్యావంతులు ఆలోచించాలి..
పీఆర్టీయూ ఆత్మీయ సమ్మేళనంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి
సుబేదారి, మార్చి 12 : నిండు మనస్సుతో తనను ఆశీర్వదించి మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి గెలిపిస్తే ఉపాధ్యాయులు, ఉద్యోగుల ప్రతినిధిగా ఉండి సమస్యల పరిష్కారానికి ముందుండి పనిచేస్తానని వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి హామీ ఇచ్చారు. వరంగల్ నగరంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్తో కలిసి శుక్రవారం పలు సమావేశాల్లో పాల్గొన్నారు. హన్మకొండ హంటర్రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్లో పీఆర్టీయూతో నిర్వహించిన సమ్మేళనంలో పల్లా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగుల పాత్ర మరువలేనిదని, స్వరాష్ట్రం సిద్ధించాక టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, అంతకుముందు దుస్థితిని బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
‘నిండు మనస్సుతో నన్ను ఆశీర్వదించి మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి గెలిపించండి.. ఉపాధ్యాయుల ప్రతినిధిగా ఉండి మీ సమస్యల పరిష్కారం కోసం ముందుం డి పనిచేస్తా’నని వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి హామీ ఇచ్చారు. హన్మకొండ హంటర్రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్లో పీఆర్టీయూ ఉ మ్మడి వరంగల్ జిల్లా ఆత్మీయ సమ్మేళనాన్ని అర్బ న్ జిల్లా అధ్యక్షుడు ఎన్వీఆర్ రాజు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించగా పల్లాతో పాటు, మంత్రి దయాకర్రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, చీఫ్విప్ దాస్యం వి నయ్భాస్కర్, పీఆర్టీయూ రాష్ట్ర కమిటీ అధ్యక్షు డు పింగిళి శ్రీపాల్రెడ్డి, టీఎన్జీవోస్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కారం రవీందర్రెడ్డి, ఉద్యోగ సంఘా ల అధ్యక్షులు పరిటాల సుబ్బారావు, కోలా రాజేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఉద్యమ సమయంలో కేసీఆర్ వెన్నంటి ఉండి పోరాటం చేశారని గుర్తు చేశారు. ఏడేళ్లలో సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, పనితీరు కళ్లముందు కనిపిస్తున్నదని, కొందరు పనిగట్టుకొని విమర్శలు చేస్తున్నారని, విద్యావంతులైన ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఒక్కసారి పరిశీలన చేయాలని కోరారు.
ఉపాధ్యాయుల పక్షపాతి పల్లా : చీఫ్విప్
ప్రభుత్వ చీఫ్విప్ వినయ్భాస్కర్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల పక్షపాతిగా పల్లా రాజేశ్వర్రెడ్డి ఉంటారని, ఏ సమస్య వచ్చినా వెంటనే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే సత్తా ఆయనకు ఉందని చెప్పారు. సమ్మేళనంలో వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, ములుగు, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల పీఆర్టీయూ అధ్యక్ష కార్యదర్శులు, మండల కమిటీల బాధ్యులు, పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
చిక్కుముడులు విప్పుతూ ముందుకు..