ముంబై: డాక్టర్పై దాడి(Doctor Assaulted) ఘటన మరోసారి మహారాష్ట్రలో చోటుచేసుకున్నది. ఇటీవల శివసేన కార్పొరేటర్ ఒకరు.. మహిళా డాక్టర్ను కొట్టిన విషయం తెలిసిందే. ఇక తాజాగా కళ్యాణ్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో డాక్టర్పై దాడి జరిగింది. ఆర్దోపెడిక్ వైద్యుడు డాక్టర్ యోగేంద్ర జైస్వాల్ను.. ఓ పేషెంట్ కొడుకు కొట్టాడు. దురుసుగా మాట్లాడటాన్ని డాక్టర్ వ్యతిరేకించాడు. దీంతో అతను మరింత కోపంతో అటాక్ చేశాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం రాత్రి 11 గంటలకు దాడి జరిగింది.
పక్కటెముక ఫ్రాక్చర్ అయిన ఓ వ్యక్తి ఆస్పత్రికి వచ్చాడని, అతన్ని పరిశీలిస్తున్న సమయంలో.. బ్యాండేజ్ ఎలా వేసుకోవాలి, మెడిసిన్ ఎలా తీసుకోవాలని చెబుతున్న సమయంలో అతని కుమారుడు పదేపదే ప్రశ్నలు వేశాడని, చాలా అమర్యాదకరంగా మాట్లాడాడని డాక్టర్ యోగేంద్ర జైస్వాల్ తెలిపాడు. ఎందుకు అంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నావని ప్రశ్నించడంతో.. ఆ పేషెంట్ కుమారుడు ఎదురు తిరిగినట్లు డాక్టర్ చెప్పాడు. ఆస్పత్రి బయటకు వెళ్లి గట్టిగా అరుస్తున్న అతన్ని మందలించడంతో.. మళ్లీ లోపలికి వచ్చి దాడి చేసినట్లు డాక్టర్ తెలిపారు.
ఈ ఘటనకు చెందిన వీడియో కూడా వైరల్ అవుతోంది.