ముంబై: బీజేపీ నేతపై దాడి నేపథ్యంలో వివాదస్పద లేఖ జారీ చేసిన మహారాష్ట్రకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేతను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ను అగౌరవపరిచేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన పూణేకు చెందిన బీజేపీ అధికార ప్రతినిధి వినాయక్ అంబేకర్ కార్యాలయానికి కొందరు ఎన్సీపీ కార్యకర్తలు వెళ్లారు. శరద్ పవార్కు వ్యతిరేకంగా ఆయన చేసిన పోస్ట్పై నిలదీశారు. పవార్పై వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేకర్ నిరాకరించడంతో ఓ కార్యకర్త ఆయన చెంప చెళ్లుమనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు బీజేపీ అధికార ప్రతినిధి వినాయక్ అంబేకర్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పన్ను సంప్రదింపుల కోసం తన కార్యాలయానికి వచ్చిన ఎన్సీపీ కార్యకర్తలు తనను దూషించడంతోపాటు దాడి చేసినట్లు ఆరోపించారు. దీంతో పోలీసులు నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
కాగా, బీజేపీ నేతపై దాడికి దారి తీసిన పరిణామాలపై ఎన్సీపీ ఆరా తీసింది. శరద్ పవార్ను విమర్శించే వారిని వదిలి పెట్టవద్దంటూ పశ్చిమ మహారాష్ట్ర ఎన్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు పార్టీ కార్యకర్తలకు లేఖ పంపినట్లు తెలిసింది. దీంతో సోమవారం అతడ్ని పార్టీ నుంచి ఎన్సీపీ సస్పెండ్ చేసింది.
महाराष्ट्र प्रदेश भारतीय जनता पार्टीचे प्रवक्ते प्रा. विनायक आंबेकर यांच्या वर राष्ट्रवादीच्या गुंडांनी भ्याड हल्ला केला असून, भाजपाच्या वतीने मी या हल्ल्याचा तीव्र शब्दांत निषेध व्यक्त करतो. राष्ट्रवादीच्या या गुंडांवर तात्काळ कारवाई झालीच पाहिजे !@BJP4Maharashtra pic.twitter.com/qR7lNc1IEN
— Chandrakant Patil (@ChDadaPatil) May 14, 2022