న్యూఢిల్లీ: వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న సీనియర్ సిటీజన్లకు మాత్రమే మోల్నుపిరావిర్ ఔషధాన్ని ఇవ్వాలని నీతి ఆయోగ్ కోవిడ్ వర్కింగ్ గ్రూపు డాక్టర్ ఎన్కే అరోరా తెలిపారు. పలు అంశాలపై ఆయన ఇవాళ ఓ వీడియోలో మాట్లాడారు. దవఖానాల్లో చేరికలను తగ్గిస్తున్న మోల్నపిరావిర్ మందును కేవలం వయోవృద్ధులకు ఇవ్వాలన్నారు. పునరుత్పత్తి వ్యవస్థ యాక్టివ్గా ఉన్నవారి ఆ ఔషధాన్ని ఇవ్వవద్దన్నారు. యువకుల్లో ఆ ఔషధం వాడడం వల్ల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు.
కోవిడ్ ఉదృతిని వివిధ ఐఐటీలు అంచనా వేసినట్లే కేసులు పెరుగుతున్నాయని డాక్టర్ అరోరా చెప్పారు. వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో కోవిడ్ ప్రవర్తనానియమావళి, వ్యాక్సినేషన్ కీలకమన్నారు. కర్ఫ్యూ లాంటి కఠిన నిబంధనలు కూడా ఉపయోగపడుతాయన్నారు. ఒమిక్రాన్ వేరియంట్లో మూడు నుంచి నాలుగ రకాల సబ్ లీనియేజ్లు ఉన్నట్లు ఆయన చెప్పారు.