EarthQuake | జమ్ముకశ్మీర్లో శనివారం సాయంత్రం మోస్తరు తీవ్రత గల భూకంపం చోటు చేసుకున్నది. అయితే, దీని ప్రభావంతో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని ప్రకృతి వైపరీత్యాల నివారణ సంస్థ అధికారులు చెప్పారు. శనివారం సాయంత్రం 6.45 గంటల సమయంలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.1గా నమోదైంది.
ఆఫ్ఘనిస్థాన్-తజకిస్థాన్ రీజియన్ పరిధిలో భూగర్భంలో 216 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. 36.55 డిగ్రీల అక్షాంక్ష రేఖ, 71.20 డిగ్రీల రేఖాంశ రేఖ మధ్య భూకంపం జరిగింది. కశ్మీర్లోయలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు జరిగాయి. 2005 అక్టోబర్ 8న సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్పై 7.6గా నమోదైంది. జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లోని ఎల్వోసీకి ఇరువైపులా 80 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కశ్మీర్ రీజియన్ పూర్తిగా భూకంపాలు సంభవించే ప్రాంతంగా నిలిచింది.