న్యూఢిల్లీ: అంగారక గ్రహంపై గుండ్రటి రింగులా ఉన్న శిల ఆకారాన్ని మార్స్ రోవర్ పసిగట్టింది. జూలై 2020లో అంగారక గ్రహంపై పురాతన సూక్ష్మజీవుల సంకేతాల జాడ కోసం ప్రయోగించిన ఈ రోవర్ జెజెరో క్రేటర్ను అన్వేషిస్తుంది. డోనట్ ఆకారంలో మార్స్ ఉపరితలంపై తాజాగా కనుగొన్న దీనిని సుమారు 328 అడుగుల దూరం నుంచి రోవర్లోని కెమెరా చిత్రీకరించింది.
దీంతో దాని నమూనా ముక్కలు, ఇసుకను సేకరించారు. త్వరలోనే వాటిని భూమికి పంపి విశ్లేషించడం ద్వారా భవిష్యత్తులో అంగారకునిపై చేసే ప్రయోగాలకు ఉపయోగకారిగా ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఏలియన్ టాయిలెట్గా నెటిజన్లు వ్యాఖ్యానించారు. ఆకాశం నుంచి ఊడిపడ్డ ఉల్క కావచ్చునని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.