హైదరాబాద్ : తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ సెన్సేషనల్ కాంబినేషన్స్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, సంచలన దర్శకుడు కొరటాల శివ కూడా ఒకటి. ఈ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా ఎంతటి విజయం సాధించిందనేది ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఐదేళ్ల కింద వచ్చిన ఈ చిత్రం 80 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు అప్పట్లో కోట్లు విలువ చేసే విల్లాను జూనియర్ ఎన్టీఆర్ ఈ దర్శకుడికి బహుమతిగా ఇచ్చాడు కూడా. జనతా గ్యారేజ్ తర్వాత ఈయన చేసిన భరత్ అనే నేను సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఇప్పుడు మళ్లీ ఎన్టీఆర్ తో కాంబినేషన్ సెట్ చేసుకున్నాడు. చిరంజీవితో చేస్తున్న ఆచార్య పూర్తి కాగానే జూనియర్ ఎన్టీఆర్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు కొరటాల శివ.
అంతేకాదు పోయినసారి రిపేర్లు లోకల్లో జరిగాయి కానీ ఈసారి పాన్ ఇండియన్ స్థాయిలో జరుగుతాయని క్లారిటీ ఇచ్చాడు కొరటాల శివ. మరి ఆ పాన్ ఇండియన్ కథ ఎలా ఉండబోతుందనే ఆసక్తి అందర్లోనూ ఉంది. జనతా గ్యారేజ్లో ఎప్పట్లాగే నాయకుడు కథను కొరటాల. ఇప్పుడు మరోసారి ఈయన పవర్ ఫుల్ కథతోనే రాబోతున్నాడని తెలుస్తుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఎలా కనిపిస్తాడు.. ఎలా ఉంటాడు అనే దానిపై ఇప్పట్నుంచే నందమూరి అభిమానులు ఊహించుకుంటున్నారు. ఓ చిన్న ఊరు నుంచి పట్నం వచ్చి అక్కడ ఎలా రూలర్ గా మారాడు.. జనానికి అండగా ఎలా ఉన్నాడు అనే లైన్ తో ఈ సినిమాను కొరటాల తెరకెక్కించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.
పరిస్థితుల కారణంగా సాధారణంగా ఉన్న వ్యక్తి.. అసాధారణంగా ఎలా ఎదిగాడు అనేది చాలా సినిమాల్లో చూసిన కథే. రొటీన్ గానే ఉన్న ఈ కథను కమర్షియల్ గా తెరకెక్కించడంలో కొరటాల సిద్ధహస్తుడు. ఇంకా చెప్పాలంటే తన సినిమాలన్నింటిలోనూ రొటీన్ కథే ఉంటుంది కానీ స్క్రీన్ ప్లే మాత్రం అద్భుతంగా ఉంటుంది. అక్కడే అందర్నీ మాయ చేస్తాడు.. మార్కులు కొట్టేస్తాడు. ఇప్పుడు జూనియర్ సినిమా విషయంలోనూ ఇదే చేయాలని చూస్తున్నాడు శివ కొరటాల. పైగా కథల విషయంలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. ఏదేమైనా కూడా ఈ కాంబినేషన్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు.