ముంబై: ప్రధాని మోదీ ఫొటో ఉన్న బ్యానర్పై ఒక వ్యక్తి రాయి విసిరాడు. (Man Pelts Stone At Modi Banner) పలుమార్లు అదే పని చేశాడు. అక్కడున్న స్థానికులు దీనిని చూశారు. కొందరు వ్యక్తులు మొబైల్లో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని నాగపూర్లో ఈ సంఘటన జరిగింది. 30 ఏళ్ల వ్యక్తి స్థానిక బస్టాంప్ వద్ద ప్రధాని మోదీ బ్యానర్ను చూశాడు. బీజేపీ ఏర్పాటు చేసి వికాసిత్ భారత్ సంకల్ప్ యాత్ర బ్యానర్ పట్ల అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. చేతిలో రాయి తీసుకుని బ్యానర్పై ఉన్న మోదీ ఫొటోపై పలు మార్లు విసిరాడు. స్థానికులు అక్కడ గుమిగూడి దీనిని చూశారు.
కాగా, కొందరు వ్యక్తులు తమ మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గుజరాత్ కాంగ్రెస్ నేత హితేంద్ర పితాడియా ఈ వీడియో క్లిప్ను ఎక్స్లో షేర్ చేశారు. ‘నరేంద్ర మోడీపై నాగ్పూర్లో అంత ద్వేషమా!’ అని పేర్కొన్నారు. అయితే ఈ సంఘటనపై పోలీసులు స్పందించి ఆ వ్యక్తిపై చర్యలు తీసుకున్నారా లేదా అన్నది తెలియలేదు.
नागपुर में नरेंद्र मोदी से इतनी नफरत..!! pic.twitter.com/Gl269cItpW
— Hitendra Pithadiya 🇮🇳 (@HitenPithadiya) December 27, 2023