జైపూర్: బ్లూటూత్ హెడ్ఫోన్స్ పేలి 28 ఏండ్ల యువకుడు మృతిచెందిన ఘటన రాజస్థాన్లో చోటుచేసుకున్నది. జైపూర్ జిల్లా ఉదయ్పురియా గ్రామానికి చెందిన రాకేశ్కుమార్ నగర్ చార్జింగ్ పెడుతూనే హెడ్ఫోన్స్ను వాడాడు. అవి పేలటంతో అతడు ఒక్కసారిగా కోమాలోకి వెళ్లిపోయాడు. హుటాహుటిన ప్రైవేటు దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఘటన జరిగినపుడు మృతుడు గుండెపోటుకు గురై ఉండవచ్చని డాక్టర్లు పేర్కొన్నారు. రాకేశ్కు గత ఫిబ్రవరిలోనే పెండ్లి అయ్యిందని పోలీసులు తెలిపారు.