కేంద్రంపై మండిపడ్డ విపక్షాలు
ముంబై: సోనూసూద్కు చెందిన ముంబైలోని నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. అలాగే ముంబైతో పాటు, లక్నోలోని ఆరు ప్రాంతాల్లో ఈ సోదాలు జరిపారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆదాయ వివరాల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలతో ఈ సోదాలు జరిపినట్టు అధికారులు తెలిపారు. కరోనా లాక్డౌన్లో వలస కార్మికులను ఇండ్లకు చేర్చేందుకు సౌకర్యాలు కల్పించిన సోనూ ‘రియల్ హీరో’గా వార్తల్లో నిలిచారు
సోదాలు అందుకేనా?
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను సోనూసూద్ కలుసుకున్న కొన్నిరోజులకే సోనూ నివాసాల మీద ఆదాయపన్ను శాఖ సోదాలు జరుపడం గమనార్హం. విద్యార్థుల కోసం చేపట్టిన ‘దేశ్ కే మెంటార్స్’కు సోనూను ఢిల్లీ ప్రభుత్వం అంబాసిడర్గా ప్రకటించింది. ఈ సందర్భంగా మీడియా ఆయనను రాజకీయాల్లో చేరుతారా? ఆమ్ ఆద్మీ పార్టీతో ప్రయాణం మొదలుపెడతారా? అని ప్రశ్నించింది. మంచిపని చేయడానికి రాజకీయాల్లోనే చేరాల్సిన పనిలేదంటూ సోనూ ఆ అంశాన్ని దాటవేశారు. సోనూ నివాసంపై ఐటీ దాడులను శివసేన వంటి విపక్షాలు ఖండిస్తూ కేంద్రంపై మండిపడ్డాయి. ఆపదలో సోనూసూద్ ఆదుకున్న లక్షలాది మంది ఆయనకు అండగా ఉంటారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు.