ముంబై: మహారాష్ట్రలో కోవిడ్ ఉదృతంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ రాష్ట్రంలో పలు చోట్ల కోవిడ్ టీకా నిల్వలు అడుగంటనున్నాయి. కేవలం మరో మూడు రోజులకు సరిపడే టీకాలు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు మహా ప్రభుత్వం వెల్లడించింది. టీకా సరఫరాను పెంచాలని కేంద్రాన్ని కోరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోప్ తెలిపారు. ముంబై లాంటి నగరాల్లో టీకా నిల్వలు శరవేగంగా తగ్గుతున్నాయని ఆయన చెప్పారు. వ్యాక్సిన్ స్టాక్స్ కేవలం మూడు రోజులకు సరిపడా ఉన్నాయని, మరిన్ని టీకాలు పంపాలని కేంద్రాన్ని కోరామని, ప్రతి రోజు ఇక్కడ అత్యధిక సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయని, ముంబైలో కూడా టీకా నిల్వలు కేవలం మూడు రోజులకు మాత్రమే ఉన్నాయని, ఈ పరిస్థితి గురించి కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్కు వివరించినట్లు ఆరోగ్య మంత్రి రాజేశ్ తెలిపారు. చాలా వరకు వ్యాక్సిన్ సెంటర్లలో డోసులు లేవని, వాటిని మూసివేశామని, డోసులు లేకపోవడం వల్ల చాలా మందిని వెనక్కి పంపేస్తున్నామని, అందుకే కొత్త డోసులు సరఫరా చేయాలని ఆయన కోరారు.