పాట్నా: బీహార్ సీఎం, జేడీ(యూ) అధ్యక్షుడు నితీశ్ కుమార్కు (Nitish Kumar ) తలుపులు తెరిచే ఉన్నాయని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ శుక్రవారం మీడియాతో అన్నారు. మహాకూటమిలోకి ఆయన తిరిగి వస్తే చూద్దామని చెప్పారు. అయితే లాలూ చేసిన ఈ వ్యాఖ్యలపై నితీశ్ కుమార్ శనివారం స్పందించారు. ఎవరు ఏమి చెప్పినా తాను పట్టించుకోనని అన్నారు. ‘పరిస్థితులు సరిగ్గా లేవు. అందుకే నేను వారిని (ఆర్జేడీ) వీడాను’ అని చెప్పారు. తమ మధ్య ఏం తప్పు జరిగిందో అన్నదానిపై ఇప్పుడు దర్యాప్తు చేస్తామని మీడియాకు తెలిపారు.
కాగా, ప్రతిపక్ష కూటమికి ‘ఇండియా’ బ్లాక్ అని పేరు పెట్టడం తనకు ఇష్టం లేదని నితీశ్ కుమార్ తెలిపారు. ‘నేను నా వంతు ప్రయత్నం చేశా. కూటమికి ఈ పేరు పెట్టడానికి నేను ఇష్టపడలేదు. నా మనస్సులో వేరే విషయం ఉంది’ అని అన్నారు. అయితే ఆ కూటమితో పొత్తు ముగిసిందని చెప్పారు. బీహార్ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నానని వెల్లడించారు.
జనవరిలో ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వం నుంచి తప్పుకున్న నితీశ్ కుమార్ మళ్లీ బీజేపీతో జతకట్టారు. ఎన్డీయే మద్దతుతో మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇకపై శాశ్వతంగా ఎన్డీయేతో కలిసి ఉంటానని స్పష్టం చేశారు.
#WATCH | On Lalu Yadav's 'doors open' remark, Bihar CM & JD(U) leader Nitish Kumar says, "Don't think of who says what…Things were not going well, so I left them (RJD)…" pic.twitter.com/CEBDq5LaMn
— ANI (@ANI) February 17, 2024