పనాజీ: కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. సోమవారం నాటి కేసులతో పోల్చుకుంటే ఇవాళ రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కొంత తగ్గినా.. ఓవరాల్గా ప్రభావం తీవ్రంగానే ఉన్నదని వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ థర్డ్ వేవ్ విస్తృతి కనిపిస్తున్నదని చెప్పారు. గోవాలోనూ కరోనా స్పీడ్ అందుకున్నది. ఇవాళ గోవా ఉపముఖ్యమంత్రి మనోహర్ ఆజ్గవోంకర్కు కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆయనను పనాజీ సమీపంలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.