Today History: భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రధాన అంశంగా పేర్కొనే గాంధీ-ఇర్విన్ ఒప్పందం 1931లో సరిగ్గా ఇదే రోజు జరిగింది. ఈ ఒప్పందంపై అప్పటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్, కరంచంద్ గాంధీ సంతకాలు చేశారు. తొలి నుంచి భారతీయులను చిన్నచూపు చూస్తూ వచ్చిన బ్రిటిష్ ప్రభుత్వం.. ఈ ఒప్పందం సమయంలో భారతీయులకు సమాన పీఠం వేసింది. సమ ఉజ్జీలుగా ఇద్దరి మధ్య చర్చలు సాగాయి. అయితే, ఈ ఒప్పందంపై ఇటు కాంగ్రెస్లోనూ.. అటు ఆంగ్లేయ సర్కార్లోనూ అసంతృప్తి వ్యక్తమైందని చరిత్ర చెప్తున్నది. భగత్సింగ్కు విధించిన ఉరిశిక్షను ఆపాలని వైస్రాయ్పై గాంధీ ఒత్తిడి తెకపోవడం వల్లనే ఆయనకు ఉరిశిక్ష విధించారని చరిత్రకారులు నమ్ముతుంటారు.
ఈ ఒప్పందం నేపథ్యాన్ని గమనిస్తే.. భారతీయుల ఉప్పు తయారీ, అమ్మకాలపై బ్రిటిష్ ప్రభుత్వం నిషేధం విధించింది. దీనికి వ్యతిరేకంగా గాంధీ అహ్మదాబాద్లోని సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు మార్చ్ చేపట్టారు. ఇది శాసనోల్లంఘన ఉద్యమం దిశగా తొలి అడుగు పడేందుకు కారణమైంది. గాంధీ స్వయంగా బీచ్కు చేరుకోవడం ద్వారా ఈ ఉప్పుపై బ్రిటిష్ నిషేధాజ్ఞలను ఉల్లంఘించారు. దాంతో గాంధీని జైలులో పెట్టారు. దీని కారణంగా లార్డ్ ఇర్విన్కు కష్టాలు పెరిగాయి. ఐదు రౌండ్ల భేటీ తర్వాత 1931 మార్చి 5న కరంచంద్ గాంధీతో ఇర్విన్ ఒప్పందం చేసుకున్నాడు. అయితే, ఈ ఒప్పందాన్నిజవహర్లాల్ నెహ్రూతో పాటు కాంగ్రెస్లోని అనేకమంది వ్యతిరేకించారు. మరోవైపు.. భారత డిమాండ్లను అంగీకరించటం బ్రిటిష్ బ్యూరోక్రసీకి నచ్చలేదు.
హింసకు పాల్పడిన నిందితులు మినహా రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేసేందుకు ఈ ఒప్పందంలో అంగీకరించారు. భగత్ సింగ్ను ఉరితీయడాన్ని ఆపాలని కాంగ్రెస్తో పాటు దేశం మొత్తం నుంచి గాంధీపై ఒత్తిడి వచ్చింది. అయితే, ఒప్పందంలో దాని గురించి ప్రస్తావించలేదు. దాంతో భగత్ సింగ్తోపాటు మరో ఇద్దర్ని 1931 మార్చి 23 న ఉరితీశారు. ఇలాఉండగా, ఈ ఒప్పందం జరిగిన నెల రోజులకే వైస్రాయ్ పదవి నుంచి ఇర్విన్ తప్పుకొని లండన్ వెళ్లిపోవడంతో.. తిరిగి నిర్బంధాలు మొదలవడం, రౌండ్ టేబుల్ సమావేశంలోని నిర్ణయాలకు తూట్లు పొడవడం ప్రారంభమైంది. దాంతో ఈ ఒప్పందం కాస్తా మూలనపడిపోయింది.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..