న్యూఢిల్లీ: శాస్త్రవేత్తలు భూ అంతర్భాగంలో ఏం జరుగుతున్నదో తేల్చారు. భూమిలోని కోర్ భాగం తిరగటం ఆగిపోయిందని చెబుతున్నారు. వాస్తవానికి భూమి అంతర్భాగంలో మూడు భాగాలుంటాయి. ఒకటి కోర్, రెండోది ఆవరణం, మూడోది భూపటలం. దాదాపు 7వేల కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్న కోర్ భాగం తిరుగుతూ ఉండేది. కానీ, అదిప్పుడు తిరగటం ఆగిపోయిందని, బహుశా వ్యతిరేక దిశలో తిరిగేందుకు ఇలా ఆగిపోయిందేమోనని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీని ప్రభావం కాలమానంపై పడే అవకాశం ఉన్నదని వెల్లడించారు.