న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వ ప్రతిపాదిత నియోజకవర్గ పునర్విభజన బిల్లుకు డీఎంకే మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఆదివారం అఖిలపక్ష సమావేశం అనంతరం రివెల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఎంపీ ప్రేమ్చంద్రన్ తెలిపిన వివరాల ప్రకారం డీఎంకే ఈ బిల్లు మద్దతుకు అంగీకరించింది. ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నట్టు ప్రభుత్వం ఇంకా ప్రకటించకపోయినప్పటికీ బిల్లు ఆమోదానికి అవసరమైన ఎంపీల మద్దతు సేకరించగలమని అధికార పక్షం ఆశావహ దృక్పథంతో ఉన్నది. మొదట్లో ఈ బిల్లు వల్ల పార్లమెంట్లో దక్షిణాదికి ప్రాతినిధ్యం తగ్గుతుందని వ్యతిరేకించిన డీఎంకే తాజాగా తన వైఖరి మార్చుకున్నది. ఇండియా కూటమి నుంచి వైదొలగిన తర్వాత డీఎంకేకు కాంగ్రెస్తో ఉన్న సంబంధాలు క్షీణించిన తరుణంలో ఈ మార్పు చోటుచేసుకుంది. తమిళనాడుపై దాని ప్రభావం ఆధారంగానే డీలిమిటేషన్ బిల్లును అంచనా వేస్తామని డీఎంకే తెలిపింది.