చెన్నై: డీఎంకే ఎంపీ టీఆర్వీ ఎస్ రమేశ్.. ఓ మర్డర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఆయన ఇవాళ తమిళనాడులోని కడలూరు జిల్లా కోర్టులో లొంగిపోయారు. ఎంపీకి చెందిన కాజూ యూనిట్లో పనిచేస్తున్న ఓ కార్మికుడి మృతి కేసులోనే ఆయన సరెండర్ కావాల్సి వచ్చింది. కడలూరు జిల్లాలోని పన్రూటి కోర్టులో ఆయన లొంగిపోయారు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని నిరూపించనున్నట్లు డీఎంకే నేత తెలిపారు. మా నాయకుడి సుపరిపాలనను అడ్డుకోవాలనుకుంటున్నవారికి అవకాశం ఇవ్వబోనన్నారు. డీఎంకే పట్ల కొన్ని పార్టీలు బురద చల్లుతున్నట్లు ఆయన ఆరోపించారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన సీబీ-సీఐడీ శాఖ.. డీఎంకే ఎంపీ రమేశ్పై లుకౌట్ నోటీసు జారీ చేసింది. గత నెలలో కాజూ యూనిట్లో పనిచేస్తున్న గోవిందరాజ్ అనే వ్యక్తి మర్డర్కు గురయ్యాడు. 8 కేజీల జీడిపప్పు చోరీ చేసిన అనుమానంపై ఆ కార్మికుడిపై ఎంపీ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఆ కంపెనీలో పనిచేస్తున్న అయిదుగుర్ని అరెస్టు చేశారు.