న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత కలుషిత మెట్రోపాలిటన్ ప్రాంతంగా బీహార్లోని బెగుసరాయి నిలిచింది. ఇక దేశ రాజధాని ఢిల్లీ మాత్రం అత్యల్ప స్థాయిలో వాయు నాణ్యత(Polluted Capital City) ఉన్న నగరంగా రికార్డుకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా అత్యల్ప వాయు నాణ్యత కలిగిన దేశాల్లో భారత్ మూడవ స్థానంలో ఉన్నది. ఆ జాబితాలో 134 దేశాల నివేదికను వెల్లడించారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్ తర్వాత ఇండియా ఉన్నట్లు వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ పేర్కొన్నది. 2022లో పీఎం 2.5 కాన్సెంట్రేషన్ ఉన్న దేశాల్లో ఇండియా 8వ స్థానంలో ఉండేది.
అతి కలుషిత మెట్రోపాలిటన్గా బెగుసరాయి తొలి స్థానంలో ఉన్నది. అక్కడ పీఎం 2.5 స్థాయి 118.9 మైక్రోగ్రామ్స్గా ఉన్నది. 2022 ర్యాంకింగ్స్లో అసలు ఈ సిటీకీ ఎక్కడ చోట లేకుండే. ఢిల్లీలో పీఎం 2.5 స్థానం రెండేళ్ల క్రితం 89.1 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్గా ఉన్నది. ఇక 2023లో ఆ రేంజ్ 92.7 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్గా మారింది.
మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ సిటీగా ఢిల్లీ నిలవడం ఇది వరుసగా నాలుగవ సారి. 2018 నుంచి ఇండియా కలుషిత ర్యాంకుల్లో టాప్లో ఉంటోంది.