న్యూఢిల్లీ, మే 12: అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని (బుధవారం) పురస్కరించుకొని నర్సులకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ ‘ఆరోగ్య భారతం కోసం నర్సులు పడుతున్న కష్టం, వృత్తిపై వారికి ఉన్న నిబద్ధత, దయాగుణం ఆదర్శప్రాయమైంది. కరోనా కాలంలో నర్సులు తమ ప్రాణాలను సైతం లెక్కజేయకుండా ముందు ఉండి పోరాడుతున్నారు’ అని పేర్కొన్నారు.