న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ పార్లమెంట్ ఆవరణలో బీజేపీ ఎంపీ హేమామాలిని స్పందించారు. వ్యాక్సినేషన్ మొదలైన తర్వాత ప్రజలు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. మాస్క్లు లేకుండా తిరగవచ్చు అని ప్రజలు భావిస్తున్నారు, కానీ కరోనా వైరస్ వ్యాప్తిలో ఉందన్న విషయాన్ని వాళ్లు గ్రహించాలన్నారు. కోవిడ్ కేసులను ప్రభుత్వం నియంత్రిస్తుందన్న నమ్మకం ఉందని ఆమె అన్నారు.