పాట్నా: బీహార్ మంత్రి జీవేశ్ మిశ్రా.. రాష్ట్ర పోలీసుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన కారును ఆపేశారు. దీంతో తన కారు దిగి వచ్చిన మంత్రి జీవేశ్.. తన కారును నిలిపేస్తారా అంటూ అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల్ని నిలదీశారు. ఎస్పీ, డీఎం వాహనాలకు క్లియరెన్స్ ఇచ్చేందుకు తన వాహనాన్ని నిలిపేశారని మంత్రి జీవేశ్ ఆరోపించారు. అసెంబ్లీ ఆవరణలో తన కారును ఆడిప పోలీసుల్ని సస్పెండ్ చేసే వరకు అసెంబ్లీలో అడుగుపెట్టనని మంత్రి జీవేశ్ శపథం చేస్తూ వెళ్లిపోయారు.
#WATCH Bihar minister Jivesh Mishra gets angry after his car is stopped in Assembly premises by police to give way to SP & DM, demands their suspension#Patna pic.twitter.com/a0JroXccPq
— ANI (@ANI) December 2, 2021