మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్లో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. స్ఫూర్తివంతమైన, ఆలోచింపజేసే వీడియోలు షేర్ చేస్తుంటారు. అవి క్షణాల్లోనే వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఆయన ఓ అంతరిక్ష అద్భుతాన్ని ట్విటర్లో పోస్ట్ చేశారు. మార్స్ నుంచి చూస్తూ భూమి ఎలా కనిపిస్తుందో చూపే చిత్రాన్ని పంచుకున్నారు. ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
ఆనంద్ మహీంద్ర రీట్వీట్ చేసిన ఫొటోను @Sciencenature14 హ్యాండిల్తో క్యూరియాసిటీ అనే పేజీ ద్వారా పోస్ట్ చేశారు. ‘ఈ అద్భుతమైన ఫోటో నిజానికి మార్స్ నుంచి తీశారు. అవును, అది మార్స్ గ్రహం ఉపరితలం.. నక్షత్రంలాంటి ఆ తెల్లటి చుక్క మన ప్రియమైన భూమి!’ అని క్యాప్షన్ ఇచ్చారు. దీన్ని ఆనంద్ మహీంద్ర రీ ట్వీట్ చేశారు. “ఈ ఫోటో మనకు నేర్పించేది ఒక్కటే.. అది వినయం..” అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ ట్వీట్పై నెటిజన్ల భారీ స్పందన వచ్చింది. అనంత విశ్వంలో మనం ఒక చిన్న చుక్క మాత్రమే అని ఒకరు వ్యాఖ్యానించగా, అది భవిష్యత్తు సెల్ఫీ పాయింట్ అంటూ మరొకరు కామెంట్ చేశారు.
If there’s just one thing this photo should teach us….it’s humility.. https://t.co/S2WN9thBBd
— anand mahindra (@anandmahindra) July 21, 2022