నోయిడా: గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ను రూ. లక్షల్లో మోసగించినందుకు ముగ్గురు హర్యానా పౌరులను ఉత్తరప్రదేశ్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఫతేపూర్కు చెందిన ఇద్దరు, ఒక హిసార్ వాసిని బుధవారం అరెస్ట్ చేసినట్లు యూపీ పోలీసులు గురువారం చెప్పారు. వీరంతా నకిలీ ఐడెంటిఫికేషన్లతో అమెజాన్ వెబ్సైట్పై పలు ఖాతాలు సృష్టించారు. విభిన్న ఉత్పత్తుల కోసం ప్రీ-పెయిడ్ ఆర్డర్లు చేసేవారు.
సదరు ఉత్పత్తులు వచ్చాక వాటిలో లోపం ఉందని, ఇతర కారణాలు చెబుతూ తాము చెల్లించిన డబ్బు రీఫండ్ చేయమని కోరేవారు. అమెజాన్ పాలసీ ప్రకారం డిఫెక్టివ్ ఉత్పత్తులను తీసుకు రావడానికి డెలివరీ బాయ్లను పంపేది. ఈ లోగా వీరు సదరు ఉత్పత్తిని తారుమారు చేసేవారు. ఈ క్రమంలో డెలివరీ బాయ్.. వారితో కుమ్మక్కయ్యేవారు.
ఈ ముగ్గురు తర్వాత ఈ ఉత్పత్తులను ఢిల్లీలో చౌక ధరకు విక్రయించే వారు. దీనిపై ఫిర్యాదు రావడంతో యూపీ పోలీసులు మోసం, ఫొర్జరీ, నేరపూరిత కుట్ర తదితర సెక్షన్ల కింద కేసు నమదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గత జూలైలో యూపీ పోలీసులు ఇదే గ్యాంగ్కు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు.