న్యూఢిల్లీ, మే 28: ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా పోరాడుతున్న పాలస్తీనాకు ఇప్పటివరకూ మద్దతిస్తూ వచ్చిన భారత్ విదేశాంగవిధానంలో మార్పు కనిపిస్తున్నది. ఇజ్రాయెల్ సైన్యానికి, పాలస్తీనా సంస్థ ‘హమాస్’కు మధ్య 11 రోజుల ఘర్షణ సందర్భంగా జరిగిన ఉల్లంఘనలు, నేరాలపై దర్యాప్తు చేపట్టాలన్న తీర్మానంపై ఓటింగ్కు భారత్ దూరంగా ఉండిపోయింది. ఇటీవలి ఘర్షణల సందర్భంగా ఇజ్రాయెల్ సైన్యంపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. జెనీవాలో గురువారం జరిగిన ఐరాస మానవ హక్కుల సంఘం ప్రత్యేక సమావేశంలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. భారత్తో పాటు 14 దేశాలు ఓటింగ్లో పాల్గొనలేదు. తీర్మానానికి అనుకూలంగా 24 దేశాలు, వ్యతిరేకంగా 9 దేశాలు ఓటేశాయి. అనుకూలంగా ఓటేసిన దేశాల్లో చైనా, రష్యా కూడా ఉన్నాయి.