వెల్దుర్తి, ఫిబ్రవరి 29: బీడు భూములను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా కేసీఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్తో లక్షలాది ఎకరాల బీడుభూములు పంటపొలాలుగా మారాయని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. కొండపోచ మ్మ సాగర్ నుంచి గోదావరి జలాలు మండల పరిధిలోని హల్దీవాగులోకి ప్రవహించడంతో గురువా రం ఎమ్మెల్యే ఉప్పులింగాపూర్ బ్రిడ్జి వద్ద మండల నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేడిగడ్డ బరాజ్ వద్ద ఏర్పడ్డ పగుళ్లకు మరమ్మతులు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తూ బరాజ్ను మరింత ప్రమాదంలో పడేస్తుందన్నారు.
నాలుగు సంవత్సరాల నుంచి కొండపోచమ్మ సాగ ర్ ద్వారా గోదావరి జలాలు హల్దీ ప్రాజెక్టులో ప్రవహిస్తుండడంతో పరీవాహక ప్రాంత రైతులకు సా గు, తాగునీటి కష్టాలు తీరాయన్నారు. కార్యక్రమం లో పార్టీ మండలాధ్యక్షుడు భూపాల్రెడ్డి, జడ్పీటీసీ రమేశ్గౌడ్, నాయకులు కృష్ణగౌడ్, శ్రీనివాస్గౌడ్, గంగాధర్, శ్రావణ్కుమార్ తదితరులున్నారు.