‘విద్యార్థి’ గా కవితా లోకానికి సుపరిచితులైన ‘వేలూరి రాములు’ కవిత్వాన్ని ఉద్దేశించి ప్రజాకవి కాళోజీ ‘వాని కవిత్వం అలగ్’ అన్నారంటే..అంతకు మించిన ప్రమాణ పత్రం మరొకటి ఉండదు. మరొక్కమాట చెప్పాలంటే విలక్షణత, వైవిధ్యంలేని ఏ సృజన కూడా ఖండాంతర కవిత్వం కాలేదు. ఏడు సంపుటాలుగా వెలువరించిన వేలూరి రాములు (విద్యార్థ్ధి) కవిత్వంలోని అనేక కవితలు నిజంగా అవనిని ఏలాయి. ఖండాంతర ఖ్యాతి పొందాయంటే ఆయన కవిత్వంలోని వైవిధ్యమే కారణమనిపిస్తుంది.
విద్యార్ధి కవిత్వంలో అలలు కుటుంబ సంబంధాలకు ఉదాహరణగా చెప్పుకొనే కాలంలో రాసిన కవిత. ‘అప్పుడప్పుడు నాకూ అనిపిస్తుంది /గుండెలో కెలుకుతుంది /పరిచయం కోసం ప్రయత్నిద్దామని కానీ ఏదీ గులాబీ పువ్వుకూ /తాకబో యే వేళ్ళకూ మధ్య /ముళ్ళలా మౌనం. కవి విద్యార్థ్దికి /ఖండాంతర కవిగా గుర్తిం పును తెచ్చిన తొలి కవిత.
తెలుగు సాహిత్యంలో ఆరుద్ర, భువనచంద్ర లాంటి సైనిక నేపథ్యం ఉన్న కవులు న్నా..రెండు యుద్ధాల్లో పాల్గొని కూడా హిం స తప్ప మరే పాపమూ లేదు. హింసలేని ప్రపంచం ఏర్పడాలన్న ఆకాంక్ష తోనే కవిత్వం రాస్తున్నాను అని ప్రకటించటం విద్యార్థ్ది విశిష్టత. ఆయన కవిత్వం అంతా ప్రకృతికి సంబంధించిన అంశాల పైనే కేంద్రీకృతమైంది. అట్లా కాకుండా ఉంటే ఇంకా వైవిధ్యంగా ఉండేది అనే ఒక అభిప్రాయం కూడా ఉంది.
కానీ, సరిహద్దు ఆవల శత్రువు కాదు దేశం లోనే దాగున్న ఉన్మాదుల గురించి, మనిషిలో దాగిఉన్న ఉన్మాదపు ఆలోచనల గురించి, మనిషి బతుకు సాగటానికి పహారాగా నిలిచే సామాన్యుడి గురించి… తనను అలౌకిక పరిష్వంగంలోకి ఆహ్వానించే ఒకానొక అనుభూతిని గురించి… మరణం గురించి… ఇట్లా వస్తు వైవిధ్యం అబ్బుర పరుస్తుంది. దృశ్యాన్ని ఆవిష్కరించే సంభాషణల రూపంలో , లేఖల రూపం లో, డైరీల రూపంలో, కొస మెరుపుల కథల్లా శిల్ప వైవిధ్యం అలరిస్తుంది.
పక్షి, జలపాతం, సింధూర వృక్షం, రాతిగుహ, హింస, గిరికన్య.. ఇట్లా తారస పడిన అన్నింటికీ, అందరిని తన కవితల్లో నాయక-నాయిక స్థానా ల్లో పతిష్ఠించి అనుభూతించటం,‘ఆకాశంలో సగానికి సంకెళ్ళు వేసిన ‘ధర్మదేవత’ లని, హింస మత్తుకు బానిసైన నరజాతిని’, ఏకంగా మా వరసలోనే కూచుంటావా? అనే దైవాంశ సంభూతులని’ ప్రతినాయకులుగా ప్రకటించటం విద్యార్థ్ద్ధి కవిత్వాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి.
ఒకానొక సందర్భంలో కేవలం కవిత్వాన్ని కవిత్వంగానే చూడాలి కానీ కవి వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళకూడదు అన్నారేమో అనే అనుమానమూ కలుగుతుంది. కానీ ‘వాన అడవికి తలంటుతుంటే నీరు వాగులకు పురుడుపోస్తుంటే – వాగులు నదులకు ప్రాణం పోస్తుంటే నదులు సముద్రాలకు రక్తమెక్కిస్తుంటే కవీ నిద్రిస్తున్నావా!’ అన్న కవితా పాదాలు ఆ అనుమానాన్ని నివృత్తి చేస్తాయి.
అవనిపై ఏనాడో అంతరించింది సామ్యం ఉత్పత్తి నెత్తిపై కూర్చుంది స్వా మ్యం మిగులుబడి తోడనే పుట్టిండు దళారి దోపిడీ, దౌర్భాగ్యం రాచబాటయింది. సామ్యవాద సిద్ధాంతం ప్రతిపాదితం అవుతుంది. తత్వం ఏదైనా, ఎవరిదైనా – తనదైన తత్వాన్ని నిర్మించుకోవటమే విద్యార్థ్ది విలక్షణత అని అర్ధం అవుతుంది.
ఇక దృశ్యం నుంచి దృశ్యానికి దృష్టి సారిస్తే..‘ఒక మహా విస్ఫోటనం కదా – నీకూ నాకూ జన్మనిచ్చింది. ఈ అనంతంలో ఎక్కడో ఒక బిందువు నుంచే కదా నీకూ నాకూ మధ్య పరుగు పందెం మొదలయ్యింది.’అంటూ శాస్ర్తాన్ని తత్వాన్ని పెనవేసి … అక్షర బధ్ధం చేసిన సృష్టి శాసనం’ కనిపిస్తుంది.
కొంచెం ముందుకు వెళితే..‘ఆమె ఎఱుక మారుతమై వీచింది. నాలోని అజ్ఞాన శిఖరాలు కూలిపోయాయి, నేను మరో తనంలోకి కరిగి పోయాను.’అంటూ చదివితే, ఈ ‘ఆమె’ ఎవరు? కవితా కన్యకనా? విద్యార్థ్ద్ధిని మరోతనం లోకి తీసుకెళ్ళే ఒక దివ్యానుభూతియా! అన్న సంశ యం కలుగుతుంది. ‘క్రమంగా దృశ్య పరిసరాలూ పువ్వుల్ని మోస్తున్న రోడ్డూ ముచ్చటిస్తున్న నేనూ చెమరిపోయాము. నిజంగా నేను లేని తనం ఎం త గొప్పది. ‘మనిషిలో అరిషడ్వర్గాలులుప్తమై … మరోతనం’ సాక్షాత్కారమైనప్పుడు కలిగే ఆనం దం సాదృశ్యమై మనకు సమాధానం లభిస్తుంది.
విద్యార్థ్ది కవిత్వం మీద పరిశోధనలు జరిగాయి. శతాధిక వ్యాసాలు ప్రచురితమైనాయి. అనువాదాలు జరిగినై. ప్రత్యేక సంచికలు వెలువడినై. కవి సంధ్య, పరిణతవాణి, కావ్య గానాలు జరిగినై. ఇంతా జరిగాక ఈ ప్రయత్నం కేవలం విద్యార్ధి కవిత్వాన్ని అద్దంలో ఒదిగించే ప్రయత్నమే.విద్యార్ధి కవిత్వం అల గ్ అని ఒప్పించే ప్రయత్నమే.
ఎ.వి. అనిల్ ప్రసాద్
99892 92070