కంప్యూటర్ మీద పనిచేయడం అనివార్యమైపోయింది. అందుకు తగ్గట్టు మానిటర్లు కూడా స్మార్ట్ అయిపోతున్నాయి. ఇటీవల వ్యూ సోనిక్ సంస్థ టచ్ స్క్రీన్ మానిటర్ను తీసుకొచ్చింది. ‘వీపీ16’ పేరిట 15.6 అంగుళాల తెరతో ఓఎల్ఈడీ డిస్ప్లేతో రూపొందించారు. సి టైప్ చార్జర్కి కూడా కనెక్ట్ అవుతుంది కూడా. ఇది ల్యాప్టాప్ నుంచి పవర్ తీసుకోగలదు.
ల్యాప్టాప్, ట్యాబ్లాంటి వాటికి ఛార్జింగ్ కూడా ఇవ్వగలదు. మానిటర్ను నచ్చిన యాంగిల్లో పెట్టుకునేలా అడ్జస్టబుల్ స్టాండ్ ఉంటుంది. హెడ్ఫోన్ జాక్తో పాటు రెండు స్పీకర్లూ ఉంటాయి. అవసరాన్ని బట్టి కావలసినట్టు వినొచ్చు. మామూలు మానిటర్లతో పోలిస్తే తక్కువ బ్లూలైట్ విడుదల చేసే దీని బరువు, మందం కూడా తక్కువే. కాస్త పెద్ద హ్యాండ్ బ్యాగులోనో, బ్యాక్ప్యాక్లోనో పెట్టుకుని వెళ్లిపోవచ్చు. viewsonic.com లో ఆర్డర్ చేయవచ్చు. ధర రూ. 49,999.