న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధరలు మరింత తగ్గాయి. శుక్రవారం ఢిల్లీ మార్కెట్లో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.291 తగ్గి రూ.44,059కు చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.44,350 వద్ద ముగిసింది. గత ట్రేడ్లో అంతర్జాతీయ మార్కెట్లలో విలువైన లోహాల ధరలకు డిమాండ్ లేకపోవడమే దేశీయంగా పసిడి ధరలు స్వల్పంగా తగ్గడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
ఇక, వెండి ధరలు కూడా ఇవాళ దిగొచ్చాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,096 తగ్గి రూ.65,958కి చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.67,054 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1,707 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 25.67 అమెరికన్ డాలర్లు పలికింది.