కీవ్ : బెలారస్ వేదికగా మరికొద్ది సేపటల్లో రష్యా – ఉక్రెయిన్ మధ్య చర్చలు జరుగనున్నాయి. రష్యా సైనిక చర్యలో ఎప్పటికీ ఎంతో నష్టపోయిన ఉక్రెయిన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. చర్చలకు ముందు ఉక్రెయిన్ అధ్యక్షుడు వెలోడిమిర్ జెలెన్స్కీ కీలక ప్రకటన చేశారు. ప్రాణాలు కాపాడుకోండి.. దేశం విడిచి వెళ్లిపోవాలంటూ రష్యా సైనికులకు వార్నింగ్ ఇచ్చారు. చిన్న దేశమైనా ఉక్రెయిన్ త్వరలోనే పట్టు సాధించాలని నలువైపులా రష్యా ఉక్రెయిన్పై మెరుపుదాడులకు దిగినా.. ఉక్రెయిన్ ధీటుగానే బదులిస్తున్నది.
గత నాలుగు రోజులుగా కైవ్పై పట్టుసాధించకుండా ఉక్రెయిన్ దూరంగానే ఉంచింది. కాగా, రాబోయే 24 గంటలు ఉక్రెయిన్కు అత్యంత కష్టతరమైనవని జెలెన్స్కీ పేర్కొన్నారు. అదే సమయంలో ఆయన జీ7 నాయకులు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రితో మాట్లాడారు. రష్యాపై పోరులో ఉక్రెయిన్కు అన్ని దేశాలు మద్దతిస్తూనే ఉంటాయన్నారు. ఇదిలా ఉండగా.. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఇప్పటి వరకు ఉక్రెయిన్లో 352 మంది పౌరులు మరణించగా, ఇందులో 14 మంది పిల్లలు సైతం ఉన్నారు.