వాషింగ్టన్: ఉక్రెయిన్పై ఆక్రమణకు వెళ్లిన పుతిన్కు రష్యా సైన్యం తప్పుడు సమాచారం చేరవేసినట్లు తెలుస్తోంది. రష్యా మిలిటరీ తనను తప్పుదారి పట్టించిందన్న ఆలోచనలో పుతిన్ ఉన్నట్లు అమెరికా పేర్కొన్నది. ఉక్రెయిన్పై రష్యా సమరానికి దిగి నెల రోజులు దాటింది. ఈ నేపథ్యంలో వైట్హౌజ్ ప్రతినిధి కేట్ బెడింగ్ఫీల్డ్ మీడియాతో మాట్లాడారు. మిలిటరీ తప్పుదోవ పట్టించినట్లు పుతిన్ భావించడం వల్లే.. ఆయనకు, ఆ దేశ మిలిటరీ నాయకత్వం మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయని అమెరికా అంచనా వేసింది. యుద్ధం విషయంలో పుతిన్ దారుణమైన వ్యూహాత్మక తప్పిదం చేశారని, ఎందుకంటే రష్యా చాలా బలహీనమైపోయిందని, ప్రపంచ వ్యాప్తంగా ఆ దేశం ఒంటరిగా మారిపోతోందని కేట్ అన్నారు.
పుతిన్కు సరైన సమచారం చేరకపోవడం పెద్ద సమస్యే అవుతుందని పెంటగాన్ ప్రతినిది జాన్ కిర్బీ తెలిపారు. సమాచారం లేకపోవడం వల్ల పుతిన్ నమ్మకం కోల్పోతారని, దాంతో శాంతి చర్చలకు విఘాతం ఏర్పాడే అవకాశాలు ఉన్నట్లు జాన్ చెప్పారు. తప్పుడు వార్తలపై పుతిన్ లాంటి నేతలు ఎలా రియాక్ట్ అవుతారో అంచనా వేయలేమన్నారు. ఉక్రెయిన్పై దాడికి వెళ్లిన రష్యాకు భారీ స్థాయిలో తప్పుడు సమాచారం వెళ్లినట్లు తేలిందని బ్రిటన్ సైబర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధిపతి జెర్మీ ఫ్లెమింగ్ తెలిపారు. బెదిరిపోయిన రష్యా దళాలు.. తమ స్వంత ఆయుధాలను, విమానాలను ధ్వంసం చేసుకున్నట్లు ఆయన ఆరోపించారు. పుతిన్ అడ్వైజర్లు ఆయనకు నిజం చెప్పడం లేదన్నారు. సరిపోను ఆయుధాలు లేక, ఆత్మస్థైర్యం కోల్పోయిన రష్యా సైనికులు.. సీనియర్ల ఆదేశాలను పాటించడం లేదని బ్రిటన్ ఏజెన్సీ పేర్కొన్నది.